Type Here to Get Search Results !

దేశాలతో పోలిస్తే తమ పరిపాలన విభాగం భారీ స్థాయిలో పరీక్షలు


ట్రంప్‌ మాట్లాడుతూ.. ఇతర దేశాలతో పోలిస్తే తమ పరిపాలన విభాగం భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహించడం వల్ల అధిక సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తాయని అన్నారు. ‘మేము ఇప్పటి వరకు 45 మిలియన్ల పరీక్షలు నిర్వహించాము. కాబట్టి ఎక్కువ కేసులు వచ్చాయి. కొన్ని దేశాల్లో కేవలం ఆస్పత్రికి వచ్చిన వారికి, అనారోగ్యంగా ఉన్న వారికే పరీక్షలు చేస్తున్నాయి. అందుకే అక్కడ ఎక్కువ కేసులు లేవు. అయితే మనకు కేసుల ప్రభావం ఎక్కువ ఉన్నందున కత్తి మీద సాములా తయారయ్యింది’. అని పేర్కొన్నాడు. అలాగే యూఎస్‌లో అత్యల్ప మరణాల రేటు ఉందని ట్రంప్‌ అన్నారు. ‘మేము కరోనాకు వ్యతిరేకంగా గొప్పగా పనిచేస్తున్నాము. వ్యాక్సిన్‌ల వాడకం చాలా బాగా పనిచేస్తోంది. దీంతో చికిత్సా విధానంలో మంచి మార్పులు రాబోతున్నాయని ఆశిస్తున్నాను. త్వరలో మంచి వార్తను అందించబోతున్నాం’ అని డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు.
Tags